News March 21, 2025

ASF: 400 మందికి దరఖాస్తులు కావడం లేదు..!

image

జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు నేడు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు 400మంది బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది రాకపోగా.. నేడు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు కావడం లేదని వాపోయారు. ఆన్‌లైన్ చేస్తుంటే అప్లై కావడం లేదని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.

Similar News

News November 24, 2025

పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News November 24, 2025

గోపాలపురం: హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి

image

గోపాలపురం నియోజకవర్గం ఐ.ఎస్.జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను ఆలయ అధికారులకు అందించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

News November 24, 2025

రిజర్వేషన్ల ప్రక్రియ పునః పరిశీలన: మంచిర్యాల కలెక్టర్

image

రాజ్యాంగ నిబంధన, తెలంగాణ రాష్ట్ర పంచాయతి రాజ్ చట్టం, జనాభా ప్రాతిపాదికన ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వారి జనాభా సంఖ్య కంటే తక్కువగా ఉండకూడదని, అదేవిధంగా మొత్తం రిజర్వేషన్స్ 50%కి మించకూడదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని 306 గ్రామపంచాయతీలు, 2680 వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నియమావళి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పునఃపరిశీలన చేస్తామన్నారు.