News March 15, 2025

ASF: ‘PMSY పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజు నర్సయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 14000ల మత్స్యకారులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 15, 2025

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్‌ అనుదీప్‌

image

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్‌ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.

News October 15, 2025

ఒక్కరోజే రెండుసార్లు పెరిగిన బంగారం ధర!

image

గంటల వ్యవధిలోనే బంగారం ధరలు <<18010097>>రెండోసారి<<>> పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,29,440కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రా.ల గోల్డ్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,18,650గా ఉంది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఉదయం KG సిల్వర్‌పై రూ.1,000 పెరగడంతో రూ.2,07,000కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా GSTతో కలుపుకొని దాదాపు రూ.లక్షకు చేరడం గమనార్హం.

News October 15, 2025

రంజీ DAY-1: మ్యాచ్ HYD కంట్రోల్‌లో

image

రంజీ 2025-26 ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లితో HYD నెక్ట్స్ జెన్ స్టేడియంలో తలపడుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన తిలక్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆద్యంతం మనోళ్లు బౌలింగ్‌తో ఎదురుదాడికి దిగారు. టీ బ్రేక్‌కి ఢిల్లీ 55 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలుత ఢిల్లి తడబడినా కెప్టెన్ ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్ నిలబెట్టారు. HYD బౌలర్లలో మిలింద్ 2, బి.పున్నయ్య 1 వికెట్ పడగొట్టారు.