News March 15, 2025
ASF: ‘PMSY పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజు నర్సయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 14000ల మత్స్యకారులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్సైడర్ వెనిగర్లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.
News September 15, 2025
చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
News September 15, 2025
నవంబర్లో టెట్: కోన శశిధర్

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.