News November 29, 2024

బూడిద చిచ్చు.. నేడు సీఎం వద్ద పంచాయితీ

image

AP: RTPPలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్(బూడిద) తరలింపు విషయంలో BJP MLA ఆదినారాయణరెడ్డి, TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంవో నుంచి పిలుపువచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. RTPP నుంచి వేల టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించుకున్నాయి.

Similar News

News December 13, 2025

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి: కలెక్టర్ తేజస్

image

రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎన్నికల అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), పోలింగ్ అధికారులు (పీవో), సహాయ పోలింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు.

News December 13, 2025

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

image

<<18552173>>కోల్‌కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.

News December 13, 2025

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.