News March 9, 2025

19న అశోక్ లేల్యాండ్ యూనిట్ ప్రారంభం

image

AP: కృష్ణా(D) బాపులపాడు(మ) మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బాడీబిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 19న మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.16.50 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించింది. ఇటీవలే పెండింగ్ పనులన్నీ పూర్తికాగా, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ యూనిట్‌లో BS-6 ప్రమాణాలతో ఏటా 4,800 బాడీలు తయారుచేయగలరు.

Similar News

News November 21, 2025

CRICKET UPDATES

image

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 95 రన్స్‌కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్

News November 21, 2025

నకిలీ ORSలను వెంటనే తొలగించండి: FSSAI

image

ఫుడ్ సేఫ్టీ&స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నకిలీ ORSలపై స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మిస్ లీడింగ్, మోసపూరిత ఎలక్ట్రోలైట్ పానియాలను దుకాణాలు, ఇ-కామర్స్ సైట్ల నుంచి తొలగించాలంది. మార్కెట్లో ORS పేరుతో నకిలీ డ్రింక్స్ చలామణి అవుతున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి WHO గైడ్‌లైన్స్ ప్రకారం ORS స్టాండర్డ్స్‌లో లేనందున అమ్మకానికి ఉంచకుండా చూడాలని కోరింది.

News November 21, 2025

ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

image

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్‌గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్‌ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.