News December 18, 2024

రోహిత్ అభ్యర్థనతో వెనక్కి తగ్గిన అశ్విన్

image

టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన గొప్ప ప్లేయర్ అని, ఆయన్ను మిస్ అవుతామంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఆయన పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతోనే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని కెప్టెన్ రోహిత్ తెలిపారు. పింక్ బాల్ టెస్ట్ ఆడాలని తాను అభ్యర్థించడంతో ఆయన వెనక్కి తగ్గి, ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

బుమ్రాను ఉపయోగించుకోవడానికి బ్రెయిన్ కావాలి: రవిశాస్త్రి

image

SAతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్‌ ఇండియా బౌలింగ్‌లో ఫెయిల్ అవుతున్న వేళ జస్ప్రీత్‌ బుమ్రా వర్క్‌లోడ్‌పై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా గ్రేట్ బౌలర్‌. అతడిని ఉపయోగించుకోవడానికి బ్రెయిన్‌ కావాలి” అంటూ జట్టు మేనేజ్‌మెంట్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కాగా ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న వన్డేల నుంచి రెస్ట్‌లో ఉన్నారు.

News December 6, 2025

గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

image

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.

News December 6, 2025

మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

image

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.