News October 4, 2024
అశ్విన్కు తగినంత గౌరవం దక్కలేదు: రమీజ్ రాజా

ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్పై పాక్ మాజీ సెలక్టర్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా తెలివైన ఆటగాడని పేర్కొన్నారు. ‘అశ్విన్కు దక్కాల్సినంత పేరు రాలేదు. ఆల్రౌండర్గా అతని రికార్డు ఎవరికీ తక్కువ కాదు. సైలెంట్గా తలదించుకుని తన పని తాను చేసుకెళ్లిపోతుంటారు. జట్టులో ఛాన్స్ దక్కకపోయినా ఎటువంటి ఆరోపణలు చేయరు. జట్టు పరిస్థితిని తెలుసుకుని, తదనుగుణంగా మసలుకునే ఆటగాడు’ అని కొనియాడారు.
Similar News
News March 7, 2026
కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News March 7, 2026
‘గద్దర్’ అవార్డులపై నాగ్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డ్స్’ విజేతలకు అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రి ANR పేరిట అవార్డును ఇచ్చినందుకు CM రేవంత్ రెడ్డి, Dy.CM భట్టిలకు ధన్యవాదాలు తెలిపారు. ANR అవార్డు పొందిన జయసుధకు, NTR అవార్డు గ్రహీత చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తన కుమారుడు నాగచైతన్యను ‘దుల్ల కొట్టావ్ నాన్న’ అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు.
News March 7, 2026
హెలికాప్టర్లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


