News September 30, 2024
WTCలో చరిత్ర సృష్టించిన అశ్విన్
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో భారత బౌలర్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్(WTC)లో 50+ వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచారు. ఇతను 2019-21లో 71, 2021-23లో 61, 2023-25లో 50* వికెట్లు తీశారు. నాథన్ లియాన్, పాట్ కమిన్స్, టిమ్ సౌథీ రెండు సీజన్లలో 50+ వికెట్లు పడగొట్టారు. కాగా ఓవరాల్గా WTCలో 187 వికెట్లతో లియాన్ టాప్లో ఉండగా, అశ్విన్(182) రెండో స్థానంలో ఉన్నారు.
Similar News
News September 30, 2024
హిట్మ్యాన్ అరుదైన ఘనత
కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.
News September 30, 2024
PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో EVల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేపటి నుంచి(మంగళవారం) ఈ స్కీం అమలులోకి రానుంది.
News September 30, 2024
కాంగ్రెస్ వాళ్లు అటు వైపు వెళ్లకండి: KTR
TG: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. సీఎం రేవంత్ను, కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విననన్ని బూతులు తిడుతున్నారు. దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్లకండి. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. మీకు ఇదే నా సూచన. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలోకి కూడా వెళ్లలేరు’ అని అన్నారు.