News September 19, 2024
అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
Similar News
News November 1, 2025
రోహిత్, కోహ్లీ కొనసాగుతారు: ఐపీఎల్ ఛైర్మన్

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసలు కురిపించారు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ వెళ్లిపోతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడికీ వెళ్లరు. 50ఓవర్ల ఫార్మాట్ ఆడతారు’ అని అన్నారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ వంటి వారితో టీమ్ ఇండియా బెంచ్ బలంగా ఉందన్నారు.
News November 1, 2025
ఇవాళ్టి నుంచి శుభకార్యాలు ప్రారంభం!

నేడు కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో చాతుర్మాసం ముగిసి నేటి నుంచి పెళ్లిళ్లు సహా అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తూ, సాయంత్రం తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ ఏకాదశి సర్వపాపాలను తొలగిస్తుందని నమ్మకం.
News November 1, 2025
10కి తక్కువ లేదా 150కి ఎక్కువ.. ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బిహార్ ఎన్నికల్లో తాము 10 కన్నా తక్కువ లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్డీయేకు, ప్రతిపక్ష కూటమికి ఓటు వేయాలని వారు అనుకోవట్లేదు. 160-170 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.


