News March 22, 2024
భోజ్శాలలో ASI సర్వే
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల/కమల్ మౌలా మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వే చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు 12 మంది సభ్యులతో కూడిన ASI బృందం సర్వే చేస్తోంది. వాగ్దేవి దేవత ఆలయమని హిందువులు విశ్వసించే ఈ భోజ్శాల కాంప్లెక్స్పై సర్వే నిర్వహించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News October 2, 2024
దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్: తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు X ద్వారా తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. SJ సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
News October 2, 2024
ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..
ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.
News October 2, 2024
మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు
తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.