News March 27, 2025
ఏషియన్ ఛాంపియన్షిప్స్.. భారత్కు మరో పతకం

జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్-2025లో భారత్కు మరో మెడల్ దక్కింది. 97 కేజీల విభాగంలో రెజ్లర్ నితేశ్ కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కు చేరింది. నిన్న 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ బ్రాంజ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. నితేశ్ గతంలో U23 ఏషియన్ ఛాంపియన్షిప్స్, U23 వరల్డ్ ఛాంపియన్షిప్స్లోనూ పతకాలు సాధించారు.
Similar News
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 5, 2025
13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.


