News October 7, 2024
పాజిటివ్ సిగ్నల్స్ పంపిన ఆసియా స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. జపాన్ నిక్కీ, తైవాన్ సూచీలు 2% మేర పెరిగాయి. హాంగ్సెంగ్, స్ట్రెయిట్ టైమ్స్, గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఎకానమీ, జాబ్ డేటా మెరుగ్గా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణాలు. పైగా డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు పెరిగాయి. RBI MPC ప్రభావం మన మార్కెట్లపై ఉండొచ్చు.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


