News November 22, 2024

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.

Similar News

News December 20, 2025

అభివృద్ధి చిరునామా ORR.. ఇప్పుడు అమరావతి వంతు!

image

HYD అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్(ORR)ది కీలక పాత్ర. కనెక్టివిటీ పెరగడంతో నివాస, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు నూతనంగా ఎదుగుతున్న AP <<18624817>>రాజధాని<<>> అమరావతి ORRకు అడుగులు పడుతున్నాయి. ఇది పూర్తయితే 5 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే భూసేకరణకు ప్రజల సహకారం ఎలా ఉంటుంది? ఎప్పటికి పూర్తవుతుందనేదే ప్రశ్న!

News December 20, 2025

బడ్జెట్‌లో మీకేం కావాలి? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..!

image

కేంద్ర బడ్జెట్ 2026 కోసం భారత ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. దేశాభివృద్ధికి, కొత్త రూల్స్ తయారీకి మీ ఐడియాలను పంచుకోవాలని MyGovIndia Xలో పోస్ట్ చేసింది. అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలనేది ప్రభుత్వ ప్లాన్. ఆసక్తి ఉన్నవారు <>MyGov వెబ్‌సైట్‌కి<<>> వెళ్లి తమ అభిప్రాయాలను పంపొచ్చు. మీ సలహాతో దేశం కోసం మంచి పాలసీలు రూపొందించే ఛాన్స్ ఉంటుంది. మీరేం సలహా ఇస్తారో కామెంట్ చేయండి.

News December 20, 2025

వేంకన్న గుడికి గువాహటిలో 25 ఎకరాలు

image

AP: గువాహటిలో TTD ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చేందుకు అస్సాం CM హిమంత బిశ్వశర్మ ఆమోదం తెలిపారు. ‘గతంలో వేరే పట్టణాల్లో స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలన్నది ఆశయమని, ఈశాన్య భారతానికి కేంద్రంగా ఉన్న గువాహటిలో స్థలం కేటాయించాలని CM CBN అస్సాం CMకు లేఖ రాశారు’ అని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భూమితో పాటు ఆర్థిక సహకారం అందించడానికి హిమంత అంగీకరించారని చెప్పారు.