News November 22, 2024
అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.
Similar News
News February 3, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News February 3, 2026
మెడపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా?

చాలామందికి మెడ మీద పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు వైద్యులు. ఈ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నరు. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చర్మంపై మంట, దురద, నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనిలోని రసాయనాలు థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. అందుకే నేరుగా చర్మంపై దుస్తులపై స్ప్రే చేసుకోవడం బెటర్.
News February 3, 2026
TTDకి నెయ్యి సరఫరా నిబంధనలు మార్చి అక్రమాలు: పయ్యావుల

AP: TTD నెయ్యి కల్తీ జరిగేలా గత బోర్డులో నిబంధనలు మార్చారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘డెయిరీలకు 3 ఏళ్లు ఏడాదికి 4L లీటర్ల పాల సేకరణ, ₹250 CR టర్నోవర్ ఉండాలని TDP హయాంలోని బోర్డు నిబంధన పెట్టింది. YCP హయాంలోని బోర్డు టర్నోవర్ను రూ.150 కోట్లకు కుదించింది. పాల సేకరణతో సంబంధం లేకుండా చేసింది’ అని పేర్కొన్నారు. నెయ్యిలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో ఉన్నట్లు 2022 AUGలోనే CFTRI పేర్కొందని చెప్పారు.


