News November 22, 2024

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.

Similar News

News February 4, 2026

ఏడేళ్లలో 7,400 మంది నక్సలైట్ల అరెస్ట్: కేంద్రం

image

గడచిన దశాబ్దన్నర కాలం నుంచి దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రేరేపిత హింసాత్మక ఘటనలు 88 శాతం మేర తగ్గాయని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది లొంగిపోయారని తెలిపింది. 2025లో 364 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, 1,022 మందిని అరెస్టు చేశాయని, 2,337 మంది లొంగిపోయారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సభకు తెలిపారు.

News February 4, 2026

భావ వ్యక్తీకరణకు మూలం ‘విశుద్ధ చక్రం’

image

గొంతు భాగంలో ఉండే ఈ చక్రం భావ వ్యక్తీకరణకు మూలం. ఇది సరిగ్గా ఉన్నప్పుడు మాటలో స్పష్టత, సత్యాన్ని పలికే ధైర్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లభిస్తాయి. అస్థిరంగా ఉంటే గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, ఇతరులతో మాట్లాడటానికి భయం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘హం’ మంత్రాన్ని పఠించాలి. ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం ద్వారా ఈ చక్రంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు.

News February 4, 2026

ఇలాంటి భారత జట్టును గతంలో ఎప్పుడూ చూడలేదు: ధోని

image

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భయంకరమైన జట్టును తాను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించ గల జట్టుగా టీమిండియా తయారైందని, ఇదే ఊపు కొనసాగిస్తే కచ్చితంగా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.