News December 21, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు

image

TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 24, 2025

ప్రభుత్వాన్ని నిలదీసేలా BRS వ్యూహరచన

image

TG: నీటి ప్రాజెక్టులపై INC అన్యాయం చేస్తోందని, దీనిపై తానే రంగంలోకి దిగుతానని KCR ఇటీవల ప్రకటించారు. దీంతో GOVT అవే అంశాలపై ఈనెల 29 నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభలో ప్రాజెక్టులు సహా కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను హరీశ్, KTR, జగదీశ్ రెడ్డి, తలసానికి KCR అప్పగించారు. రైతు సమస్యలపై MLAలను రెడీ చేస్తున్నారు. అయితే ఆయన సభకు వస్తారా లేదా అనేదే సందిగ్ధంగా ఉంది.

News December 24, 2025

RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<>RCFL<<>>) 10 Sr. ఇంజినీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ B.Tech (కెమికల్ Engg., కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ Engg., పెట్రోకెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నేటి నుంచి JAN 7 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.rcfltd.com

News December 24, 2025

రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

image

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.