News August 22, 2025
త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News August 23, 2025
సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
News August 23, 2025
సురవరం రాజకీయ ప్రస్థానం ఇదే

CPI అగ్రనేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> MBNR జిల్లా కొండ్రావుపల్లిలో 1942 MAR 25న జన్మించారు. కర్నూలులో డిగ్రీ, HYD ఉస్మానియాలో LLB పూర్తి చేశారు. 1970లో AISF అధ్యక్షుడు, 1972లో AIYF అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1985, 90 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్, 1994లో డోన్ నుంచి పోటీ చేసి ఓడారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నుంచి MPగా ఎన్నికయ్యారు. 2012లో CPI జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
News August 23, 2025
ఆగస్టు 23: చరిత్రలో ఈ రోజు

1872: ఆంధ్రరాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జననం
1964: సంగీత దర్శకుడు SA రాజ్కుమార్ జననం
1968: దివంగత గాయకుడు కేకే జననం
1969: సినీ నటుడు వినీత్ జననం
1994: ఇంగ్లిష్ ఛానెల్ను ఈదిన తొలి భారత మహిళ ఆరతి సాహా మరణం
2005: MGNREGAకు పార్లమెంట్ ఆమోదం
* జాతీయ అంతరిక్ష దినోత్సవం