News November 22, 2024
వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని CM రేవంత్ ఆవిష్కరించనున్నారు. DEC 7 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆలోగా క్యాబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 2, 2026
చనిపోయిన ఖమేనీ మనుమరాలు ఈ పాపనే..

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఆయన కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా <<19281898>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. తాజాగా 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పసిప్రాయంలో ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అత్యంత భద్రత ఉండే ఖమేనీ గృహసముదాయంపై ఏకంగా 30 శక్తిమంతమైన బాంబులను పేల్చి హతమార్చారు.
News March 2, 2026
యువవికాసం: 16.5L అప్లికేషన్లకు ఇచ్చింది జీరో

TG: యువతకు ఆర్థిక సాయం కోసం GOVT రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి 2025-26 బడ్జెట్లో ₹6వేల CRను కేటాయించింది. ₹4 లక్షలు సబ్సిడీగా అందే ఈ పథకం కోసం 16.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత JUN 2న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరగాలి. కానీ చివరి నిమిషంలో ఆర్థిక శాఖ నిధులు లేవనడంతో జరగలేదు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఇచ్చినా అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News March 2, 2026
ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.


