News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News January 30, 2026
వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
News January 30, 2026
మున్సి’పోల్స్’.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఈరోజు సా.5 గంటలకు ముగియనుంది. రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 3,379, BRS 2,506, BJP 1,709, BSP 142, CPI(M) 88, MIM 166, AAP 17, TDP నుంచి 10 ఉన్నట్లు తెలిపింది. తొలి రోజు వచ్చిన వాటితో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కి చేరింది. చివరి రోజు మరింత పెరిగే ఛాన్సుంది.
News January 30, 2026
ఇన్స్టాగ్రామ్కు విరాట్ కోహ్లీ గుడ్ బై?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


