News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News February 9, 2026
రోహిత్, కోహ్లీకి BCCI షాక్

సెంట్రల్ కాంట్రాక్ట్(2025-26) విషయంలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు A+ కేటగిరీలో ఉన్న వారిద్దరినీ గ్రేడ్ Bలో చేర్చింది. రోకో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు బుమ్రా, గిల్, జడేజాను మాత్రమే గ్రేడ్ Aలో ఉంచింది.
News February 9, 2026
ఒక్క నిమిషంలో పని ఒత్తిడి తగ్గించుకోండి!

ఆఫీస్లో వర్క్ లోడ్ వల్ల ఎంతోమంది ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో గుండె వేగం, BP పెరుగుతాయి. వాగస్ నాడిని యాక్టివేట్ చేయడంతో దానిని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ముక్కు ద్వారా లంగ్స్ నిండా గాలిపీల్చుకోండి. ఆపి మరో షార్ప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత నోటిగుండా మెల్లగా మొత్తం గాలిని వదిలేయండి. ఇలా 4-5సార్లు చేస్తే ఒక్క నిమిషంలోపే మీ స్ట్రెస్ లెవల్స్ తగ్గిపోతాయి’ అని చెబుతున్నారు.
News February 9, 2026
‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.


