News February 7, 2025

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

Similar News

News February 10, 2026

కరీంనగర్: ముగిసిన పోలింగ్ సామాగ్రి తరలింపు

image

కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి 477 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో 93 బస్సుల్లో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే 66 డివిజన్లలోని 3.40 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

News February 10, 2026

రైల్వే జోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి: CBN

image

కొత్త రైలు మార్గాలకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు CM చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందచేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్లపై భేటీలో ప్రస్తావించారు. ‘ద.కో.రైల్వేజోన్ కార్యకలాపాలు APR1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. TPT మీదుగా VJA-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీస్ నడపాలి’ అని కోరారు.

News February 10, 2026

పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పుస్తకం

image

పబ్లిష్ కూడా కాకుండానే ఒక పుస్తకం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19098532>>రాసిన <<>>‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ బుక్ ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపజేసింది. ఒకరోజు PM సభకు రాకుండా చేసింది. ఈ వివాదం LS స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకు సభకు రావద్దని తాజాగా ఆయన నిర్ణయించుకున్నారు.