News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News February 8, 2026
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
News February 8, 2026
భాను సప్తమి వ్రతం నేడు ఎందుకు ఆచరిస్తారంటే?

నేడు భాను సప్తమి వ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్రతం చేయాలని సూచిస్తున్నారు. జాతకంలో సూర్య దోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు పొందుతారట. సూర్యుడు ‘ఆరోగ్య ప్రదాత’ కావడంతో, భాను సప్తమి నాడు చేసే పూజ, అర్ఘ్యంతో మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
News February 8, 2026
వారంలో భారీగా తగ్గిన ధరలు

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ నెల 1-7 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3,980 తగ్గి రూ.1,56,600కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.3,650 తగ్గి రూ.1,43,550గా ఉంది. అటు కేజీ వెండి ధర ఫిబ్రవరి 1న రూ.3.20 లక్షలుగా ఉండగా నిన్నటి వరకు రూ.2.85 లక్షలకు చేరింది. వారంలోనే ఏకంగా రూ.35వేలు తగ్గింది. రాబోయే రోజుల్లో ఇదే పతనం కొనసాగనుందని సమాచారం.


