News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News February 14, 2026
వారికి సున్నా.. తమ ఓటూ వేసుకోలేదు!

TG: సిద్దిపేట (D) హుస్నాబాద్ మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గడాసు రాంప్రసాద్కు ఒక్క ఓటూ పడలేదు. ఆఖరుకు తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. తాను బీజేపీ రెబల్గా పోటీ చేశానని చెప్పారు. తనతో కలిపి ఇంట్లో 3 ఓట్లు ఉండగా బీజేపీపై అభిమానంతో ఆ పార్టీకే వేసినట్లు వివరించారు. అటు మెదక్ జిల్లాలోని రామాయంపేటలోనూ మల్లేశం (ఇండిపెండెంట్)కు ఒక్క ఓటూ పడలేదు.
News February 14, 2026
BHEL 47 పోస్టులకు నోటిఫికేషన్

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://jhs.bhel.com
News February 14, 2026
సుప్రీంకోర్టులో 19 ఏళ్ల కుర్రాడి సంచలన విజయం!

కేవలం 12వ తరగతి చదివిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది సుప్రీంకోర్టులో హిస్టరీ క్రియేట్ చేశారు. NEET క్వాలిఫై అయినా EWS కోటాలో సీటు రాకపోవడంతో తనే స్వయంగా SLP డ్రాఫ్ట్ చేసి సీనియర్ లాయర్లలా వాదించారు. 10 నిమిషాల్లో జడ్జిలను ఒప్పించగలిగారు. ప్రైవేట్ కాలేజీల్లోనూ EWS కోటాను నోటిఫై చేయాలని కోర్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అథర్వకు మెడికల్ సీటు కన్ఫామ్ అయ్యింది.


