News February 7, 2025

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

Similar News

News January 1, 2026

నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

image

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.

News January 1, 2026

బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సజీవ దహనానికి యత్నం

image

బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే హిందువుపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. డిసెంబర్ 31న ఇంటికి వెళ్తున్న అతడిపై కత్తులతో అటాక్ చేసి తీవ్రంగా కొట్టి ఆపై నిప్పు పెట్టారు. దగ్గర్లో ఉన్న చెరువులోకి దూకి అతడు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృత్ మండల్, దీపూ దాస్ వంటి వారూ ఇలాంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

News January 1, 2026

ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

image

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.