News January 29, 2025

వచ్చే నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

image

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 21, 2026

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.1.30 లక్షలు ఫైన్: పార్వతీపురం SP

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 13మందిని అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోసెఫ్ ముందు హాజరు పరిచినట్లు ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం తెలిపారు. పార్వతీపురం పట్టణ ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.30 లక్షలను జరిమానా విధించారని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 21, 2026

ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

image

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

News January 21, 2026

పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

image

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.