News June 24, 2024
జులై మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆగస్టు నుంచి 2025 మార్చి ఆఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 14, 2025
ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్పై మోదీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్గా గుర్తించారు.
News December 14, 2025
తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.
News December 14, 2025
ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. 2019లో మెహర్ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్ ‘భగవంత్ కేసరి’లో మెప్పించారు.


