News June 24, 2024
జులై మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆగస్టు నుంచి 2025 మార్చి ఆఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 15, 2025
బంధాలకు భయపడుతున్నారా?

గామోఫోబియా అనేది రిలేషన్షిప్కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్మెంట్కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
News December 15, 2025
కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.
News December 15, 2025
దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


