News June 24, 2024

జులై మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్?

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆగస్టు నుంచి 2025 మార్చి ఆఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 14, 2025

KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.

News December 14, 2025

15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

image

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.

News December 14, 2025

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో తెలుసుకోవచ్చు.