News December 30, 2024

నేడు అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?

image

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమవనుంది. ఉదయం పదింటికి సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ కృషిని సభ్యులు గుర్తుచేసుకోనున్నారు. కాగా.. మన్మోహన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News November 15, 2025

రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

image

రైలులో తక్కువ ధరకే వస్తువులను <>పార్సిల్<<>> చేయొచ్చు. ‘పార్సిల్ అండ్ లగేజ్ సర్వీస్’ కింద వస్తువులు, కార్లు & బైక్స్‌ను రైలులో పంపొచ్చు. ఏ వస్తువునైనా దృఢమైన పెట్టెల్లో లేదా సంచుల్లో ప్యాక్ చేయాలి. బైక్ పంపిస్తే RC, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. బరువు & దూరం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. వారిచ్చిన రసీదును స్టేషన్‌లో చూపించి బైక్ కలెక్ట్ చేసుకోవచ్చు. ‘పార్సిల్ ఇన్సూరెన్స్’ తీసుకుంటే నష్టపరిహారం పొందొచ్చు.

News November 15, 2025

BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.

News November 15, 2025

గ్యాస్‌లైటింగ్ గురించి తెలుసా?

image

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్‌లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.