News April 12, 2024
అప్పట్లో కమ్యూనిస్టుల హవా!.. 2/2

AP: కోస్తా, రాయలసీమ ప్రాంతాలు కలిపి ఆంధ్రరాష్ట్ర అవతరణతో 1955లో మధ్యంతర ఎన్నికలు జరగ్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ 15 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 119 చోట్ల గెలిచింది. 1956లో ఆంధ్రా, TG కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో CONG 177 స్థానాల్లో నెగ్గగా, సీపీఐ 53 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో పార్టీలో చీలిక రాగా CPIకి 31, CPMకి 22 మంది MLAలు మిగిలారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 31, 2026
రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.
News March 31, 2026
నా భర్తతో స్వేచ్ఛగా విభేదిస్తా: JD వాన్స్ సతీమణి ఉష

అన్ని విషయాల్లో తాను తన భర్తతో ఏకీభవించనని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ సతీమణి ఉష తెలిపారు. ఆయన చుట్టూ ఎంత మంది అడ్వైజర్స్ ఉన్నా.. కొన్ని విషయాల్లో వాన్స్ తననే సంప్రదిస్తారని వెల్లడించారు. అలా అని ఆయన పనిలో మాత్రం తాను జోక్యం చేసుకోనని చెప్పారు. ఏదీ దాచుకోకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటామని, స్వేచ్ఛగా విభేదించుకుంటామని తెలిపారు. ఇది ఇద్దరి ఎదుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
News March 31, 2026
ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగోకు కొత్త CEOగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం IATA(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. గతంలో ఈయన బ్రిటిష్ ఎయిర్వేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. విలియం నాయకత్వంలో ఎయిర్లైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఇటీవల ఇండిగో CEO పదవికి పీటర్ ఎల్బర్స్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.


