News January 28, 2025
ATM కార్డుతో పరార్.. పల్నాడు SPకి ఫిర్యాదు

ATMలో డబ్బులు తీయడం రాని ఓ వ్యక్తి మోసపోయాడు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన వెంకటేశ్వర్లు ATMకి వెళ్లారు. డబ్బులు తీయడం తెలియక ఓ వ్యక్తి సాయం కోరాడు. అతడు రూ.10వేలు తీసి ఇచ్చి ఏటీఎం కార్డుతో పారిపోయాడు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా మరోసారి రూ.57వేలు డ్రా చేశాడు. నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 12, 2025
నిజామాబాద్: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నిక గురువారంతో ముగిసింది. రెండో విడతలో భాగంగా ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముగ్పాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.
News December 12, 2025
తిరుపతిలో అంగన్వాడీల భారీ ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. తమకు అందుతున్న వేతనాలు సరిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీతం పెంచాలని.. అర్హులైన వారికి అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది ధర్నాకు వెళ్లడంతో పలుచోట్ల అంగన్వాడీలు మూతపడ్డాయి.
News December 12, 2025
బాపట్ల: ”లోక్ అదాలత్’ సద్వినియోగం చేసుకోవాలి’

శనివారం బాపట్ల జిల్లా కోర్టుల సముదాయంలో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార కమిటీ ఛైర్మన్, జడ్జి శ్యాంబాబు కోరారు. శుక్రవారం ఆయన బాపట్లలో మాట్లాడుతూ.. అదాలత్లో పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాజీ చేసుకోదలచిన వారి ఇరుపక్షాలను సమన్వయపర్చి కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు.


