News January 28, 2025
ATM కార్డుతో పరార్.. పల్నాడు SPకి ఫిర్యాదు

ATMలో డబ్బులు తీయడం రాని ఓ వ్యక్తి మోసపోయాడు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన వెంకటేశ్వర్లు ATMకి వెళ్లారు. డబ్బులు తీయడం తెలియక ఓ వ్యక్తి సాయం కోరాడు. అతడు రూ.10వేలు తీసి ఇచ్చి ఏటీఎం కార్డుతో పారిపోయాడు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా మరోసారి రూ.57వేలు డ్రా చేశాడు. నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 9, 2025
తిరుపతి: సెమిస్టర్ వస్తున్న హాస్టల్ సీటు రాదా.!

TTD శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది 900 మంది చేరారు. అందరికి హాస్టల్ సీటు ఇస్తామని TTD బోర్డు సభ్యులు సైతం హామీ ఇచ్చారు. అయితే సెమిస్టర్ పరీక్షలు వస్తున్నా ఇప్పటి వరకు 350 మందికిపైగా హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. 2 హాస్టల్ భవనాలు ఖాళీగా ఉండగా వాటిని వెంటనే శుభ్రం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు TTD విద్యాశాఖకు హాస్టల్ సీట్ల కోసం ఫైల్ పంపి నెల కాస్తున్న ఎలాంటి స్పందన లేదు.
News December 9, 2025
KNR: కట్టింది రెండు గోడలే.. రూ.కోట్లు కొట్టేశారు..!

మానేరు రివర్ ఫ్రంట్లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పనులు అవ్వకుండానే కాంట్రాక్టర్కు రూ.192CR బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలొస్తున్నాయి. BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.545 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు మానేరుకు ఇరువైపులా కేవలం 2 రిటైనింగ్ వాల్స్ మాత్రమే కట్టారు.
News December 9, 2025
వరంగల్: పేదలను పిండడం.. కేటుగాళ్లకు పెట్టడం!

పేదలు ఆసుపత్రికి వెళ్తే చాలు, గ్రామ స్థాయి నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ముక్కు పిండి గుంజుతున్నారు. సంపాదించిన డబ్బును అక్రమ మార్గాల్లో బినామీ ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. బినామీ ఖాతాల నుంచి రూ.కోట్లు అత్యాశకు వెళ్లి సైబర్ కేటుగాళ్లకు చిక్కి సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఉమ్మడి WGLలో రూ.100కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగినా IT, ED అధికారులు ఎందుకు దృష్టి పెట్టట్లేదని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు.


