News January 28, 2025

ATP: ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం 

image

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. అనంతపురానికి చెందిన జయచంద్ర(25) బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. మనస్తాపానికి గురైన అతను ఇవాళ రాప్తాడు మండలం జంగాలపల్లి, ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

News November 12, 2025

వరంగల్: జనజాతీయ గౌరవ్ దివాస్ ప్రత్యేక గ్రామసభలు

image

ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పీవో చిత్రామిశ్రా తెలిపారు. ఈనెల 13న ఉమ్మడి జిల్లాలోని 49 ఆదిసేవ కేంద్రాలలో ప్రత్యేక గ్రామసభలు ఉంటాయన్నారు. ఈ జన్ సున్వాయ్ సెషన్‌లో గ్రామాల్లోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారన్నారు. 15న బిర్సాముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పీవో పేర్కొన్నారు.

News November 12, 2025

అధికారులకు విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూములు త్వరగా ఇవ్వాలని సూచించారు. అందరికీ ఇళ్లు పథకం దరఖాస్తులను వేగంగా పరిశీలించాలన్నారు.