News January 2, 2025
ATP: ఒంటరితనమే ఆత్మహత్యకు కారణమా?

అనంతపురంలోని ఓ కళాశాలలో <<15040374>>ఇంటర్<<>> విద్యార్థిని చిన్నతిప్పమ్మ (17) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అందిన వివరాల మేరకు.. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆర్డీటీ సహకారంతో చదువుకుంటోంది. తన జూనియర్ ఓ బాలికతో స్నేహం ఉండగా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటరితనంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 2, 2025
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్కు నోటీసులు ఇచ్చామన్నారు.


