News December 1, 2024

ATP: చింతలాయపల్లిలో ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి

image

అనంతపురం (D) యాడికి మం. చింతలాయపల్లిలో ఆదివారం విషాదం ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రామకృష్ణ, రామాంజనేయులు ఇద్దరూ ట్రాక్టర్లో గ్రామ శివారులో పునాది రాళ్లు తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ఉన్న పళంగా ముందుకొచ్చి రామకృష్ణపై దూసుకెళ్లింది. దీంతో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 29, 2025

అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

News October 29, 2025

గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.

News October 28, 2025

‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

image

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.