News June 19, 2024
ATP: జిల్లా మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

జిల్లా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ అమరావతిలోని సచివాలయంలో ఛాంబర్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు రెండో బ్లాకులోని తొలి అంతస్తులో 212వ ఛాంబరు కేటాయించారు. ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టారు. వైద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఐదో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్లో 211వ ఛాంబర్ కేటాయించగా ఈ నెల 16న బాధ్యతలు చేపట్టారు. మంత్రి సవితకు నాలుగో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్లో 131వ ఛాంబర్ కేటాయించారు.
Similar News
News October 22, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.
News October 22, 2025
పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.
News October 22, 2025
గుత్తి పీఎస్ను తనిఖీ చేసిన ఎస్పీ

గుత్తి పోలీస్ స్టేషన్ను ఎస్పీ జగదీశ్ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ముందుగా సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.