News March 21, 2025
ATP: భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం(D)లో జరిగింది. పెద్దపప్పూరు మం. వరదాయపల్లికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు SI నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
Similar News
News October 21, 2025
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.
News October 21, 2025
నాడు వణికిన అదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ను వణికించిన నక్సల్ దాడుల్లో పోలీసుల త్యాగాలు మరువలేనివి. 1987 ఆగస్టు 18న కడెం మండలం అద్దాల తిమ్మాపూర్ వద్ద సాగర్ దళ కమాండర్ మాటువేసి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులు అమరులయ్యారు. 1989లో సింగాపూర్ వద్ద జీపు పేల్చివేతలో ఎస్సై ఖాదర్లాక్తో సహా ఏడుగురు, 1999లో తర్లుపాడ్ పేలుడులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
News October 21, 2025
శివోహం.. తూ.గో. జిల్లాలో దర్శనీయ ఆలయాలు

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం రేపటి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. ఈ నెలలో తూ.గో. జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ ద్రాక్షారామ భీమేశ్వరస్వామి
★ సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి
★ కోటిపల్లి సోమేశ్వరాలయం
★ ముక్తేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయం
★ కొవ్వూరులోని బ్రహ్మసూత్ర లింగేశ్వర ఆలయం
గోదావరి తీరాన కార్తీక దీపాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.