News December 20, 2024

ATP: రైతులను చిప్‌తో మోసం చేసిన వ్యాపారులు

image

అనంతపురం(D) వజ్రకరూర్ మం. చాబాల గ్రామంలో ఘరానా మోసం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూర్ పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 26, 2025

జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్‌లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్‌ షిప్‌ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.

News November 26, 2025

జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్‌లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్‌ షిప్‌ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.

News November 26, 2025

వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి: కలెక్టర్

image

ప్రజలందరికీ భాగస్వామ్యంతో వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.