News December 20, 2024
ATP: రైతులను చిప్తో మోసం చేసిన వ్యాపారులు
అనంతపురం(D) వజ్రకరూర్ మం. చాబాల గ్రామంలో ఘరానా మోసం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూర్ పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 20, 2025
వయోపరిమితిపై సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు: ఎస్పీ
పోలీస్ దేహదారుఢ్య పరీక్ష అభ్యర్థులకు వయోపరిమితిపై జీవో 155 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ కోరారు. వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ మీడియాలో ప్రచురితమైన వార్తలో నిజం లేదన్నారు. 2022 నవంబర్ 28న ఏపీ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించాలన్నారు.
News January 20, 2025
బలమైన శక్తిగా వైసీపీ యువజన విభాగం: వైసీపీ జిల్లా అధ్యక్షుడు
వైసీపీ అనుబంధంగా యువజన విభాగం బలమైన శక్తిగా తయారు కావాలని వైసీపీ అనంతపురము జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే నాయకత్వం బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆదివారం కోర్టు రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం అనంతపురము జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం నగర పరిధిలోని యువజన విభాగం నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
News January 19, 2025
కదిరి నరసింహ సామి సాచ్చిగా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.