News October 23, 2024

ATP: వరద గాయం రూ.5కోట్ల పైనే!

image

★ అనంతపురం నగరంలో నిరాశ్రయులైన 200 కుటుంబాలు
★ పదుల సంఖ్యలో నీట మునిగిన ఆటోలు, బైక్‌లు
★ ఇళ్లల్లోని సరకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు జలమయం
★ 370 హెక్టార్లల్లో దెబ్బతిన్న పంటలు
★ 55 హెక్టార్లల్లో ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం
★ అనంత, సత్యసాయి జిల్లాల్లో 100కుపైగా మృతిచెందిన జీవాలు
★ వర్ష బీభత్సానికి నేలకూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రహదారులు
★ రెండు జిల్లాల్లో రూ.5కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అంచనా!

Similar News

News December 21, 2025

ATP: నీటి కుంటలో పడి బాలుడి మృతి

image

పెద్దవడుగూరు మండలం రావులుడికి చెందిన కమలేశ్వర్ రెడ్డి (8) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో కమలేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. గ్రామ శివారులోని కుంటలోకి ప్రమాదవశాత్తు జారి పడి ఊపిరాడక మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో రావులుడికిలో విషాదఛాయలు అలముకున్నాయి.

News December 21, 2025

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

పల్స్ పోలియోలో భాగంగా వజ్రకరూరు మండల కేంద్రంలోని PHCని ఆదివారం DMHO డాక్టర్ భ్రమరాంబ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పలు రికార్డులు, వార్డులను తనిఖీ చేశారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు ఎంతమంది పిల్లలకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు త్యాగరాజు, గంగాధర్, మండల వైద్యాధికారులు డాక్టర్ తేజస్వి, సర్దార్ వలి ఉన్నారు.

News December 21, 2025

2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

image

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.