News March 11, 2025
ATP: విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. GO నంబర్ 117 తో గతంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం జరిగిందని, బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కి.మీ లోపల హైస్కూల్ లేని చోట తగు ఏర్పాట్లు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
Similar News
News December 20, 2025
అనంత: ఒకే పాఠశాల నుంచి 52 మంది విద్యార్థులు

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీఈటీ సంజీవరాయుడు శిక్షణలో విద్యార్థులు ప్రతిభ చాటారని హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.
News December 19, 2025
ఏబీసీ అవార్డులందుకున్న జిల్లా పోలీసులు

కేసుల చేధింపులో రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ చూపిన రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐ జయనాయక్, వెంకటరమణ, వారి సిబ్బంది ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. డీజీపీ చేతుల మీదుగా ప్రతీ ఏడాది టాప్ త్రీ కేసులు చేధించిన వారికి ఏబీసీ అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎస్పీ జగదీశ్, డీఎస్పీ రవిబాబుతో కలసి డీజీపీ హరీశ్ కుమార్ గుప్త చేతుల మీదుగా వారు అవార్డును అందుకున్నారు.
News December 19, 2025
‘విద్యార్థులకు వరంలా మారిన జేఎన్టీయూ వీసీ ఆలోచనలు’

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం గురువారం M/s. ExcelR Edtechతో MOU ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి జేఎన్టీయూ వీసీ సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందం వలన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్షిప్లు ఆఫర్ చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, శోభా బిందు పాల్గొన్నారు.


