News December 25, 2024

ATP: విద్యుత్ షాక్‌తో కుమారుడి మృతి.. ఆటో బోల్తాపడి తండ్రికి గాయాలు

image

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం జె.వెంకటాంపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిలాష్ (19) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శివయ్య ఆటోలో రాయదుర్గం ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

అనంతపురంలో 48,116 మంది విద్యార్థుల ఎదురు చూపు..!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ వెలువడనున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రథమ సంవత్సరం 24,568 మంది, ద్వితీయ సంవత్సరం 23,578 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 13, 2026

హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News April 13, 2026

PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

image

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.