News June 24, 2024

ATP: టమాట కిలో రూ.80

image

టమాట ధరలు కొండెక్కాయి. ఎన్నికల సీజన్ ముగిశాక వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. సామాన్యులు టమాటలను కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో టమాట రూ.80 ధర పలుకుతుంది. రెండు రోజుల కిందట కిలో రూ.60 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడంతో ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో పాటు క్యారెట్, బీన్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకుతోంది.

Similar News

News December 26, 2025

డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ: అనంతపురం కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 2,78,388 మందికి రూ.124.47 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు.

News December 26, 2025

అనంతపురం: మహిళలకు అండగా ‘సఖి’ వాహనం

image

సమాజంలో హింసకు గురయ్యే మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సఖి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, బాధితులకు అవసరమైన రక్షణ, సాయం ఇక్కడ అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 25, 2025

శిల్పారామంలో జనవరి 1న సాంస్కృతిక కార్యక్రమాలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న సాయంత్రం 5గంటల నుంచి 8 వరకు ప్రముఖ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. అనంత ప్రజల కోసం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.