News December 31, 2025

ATP: లోక్ అదాలత్ ద్వారా 12,326 కేసులు పరిష్కారం

image

అనంతపురం జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 12,326 కేసులు పరిష్కారమైనట్లు SP జగదీష్ బుధవారం వెల్లడించారు. వివిధ కేసుల్లో 61 మందికి శిక్షలు పడ్డాయన్నారు. నిబంధనల ఉల్లంఘనపై రూ.1.35 లక్షల ఈ-చలానాలు విధించి రూ.3.93 కోట్ల జరిమానా వసూలు చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. డయల్ 100 ద్వారా కేవలం 12 నిమిషాల్లో స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నట్లు SP వివరించారు.

Similar News

News December 31, 2025

2025 అనంతపురం జిల్లా క్రైమ్ రిపోర్ట్ విడుదల

image

* 2024తో పోలిస్తే 2025లో నేరాలు 22.5 శాతం తగ్గుదల
* కేసులు 8,841 నుంచి 6,851కు తగ్గుముఖం
* 55 శాతం చోరీ కేసులు రికవరీ
* జిల్లాలో 42 హత్యలు
* గణనీయంగా తగ్గిన మహిళలపై నేరాలు, పోక్సో కేసులు
* మిస్సింగ్ కేసుల్లో 613 మంది సురక్షితం
* 9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* 544 నుంచి 496కు తగ్గిన ప్రమాదాలు
* 22 మందికి గంజాయి కేసుల్లో జైలు శిక్ష పడేలా చర్యలు

News December 31, 2025

అనంతపురంలో ‘అనంత పాల ధార’ అవగాహన కార్యక్రమం

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంత పాల ధార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేడీ ప్రేమ్ చంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 7, 8, 9 తేదీల్లో పశు పోషకులకు పాల దిగుబడి పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. వెటర్నరీ వైద్యులు ఈ పోటీలపై తమ పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పోటీలతో పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపుపై రైతులకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.

News December 31, 2025

శిల్పారామంలో పార్కింగ్‌కు వేలం పాట

image

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్‌లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.