News September 23, 2024
ATP: అయ్యో.. 15 రోజుల్లోనే ఆనందం ఆవిరి!
బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఓ.పవన్ అనే యువకుడు మదనపల్లిలో ఎంబీఏ పూర్తి చేసి 15 రోజుల క్రితం ఐటీ ఉద్యోగం సాధించారు. తమ కుమారుడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం రెండు వారాల్లోనే ఆవిరైందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు. మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది.
Similar News
News September 29, 2024
అనంత: భార్య గొంతు కోసి భర్త పరార్.. మృతి
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మగట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతి(26)ని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.
News September 29, 2024
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలకు గాయాలు
గార్లదిన్నె మండలం కలగాసపల్లి క్రాస్ వద్ద హైవేపై ఆదివారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బెంగళూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 10మంది కూలీలు, బస్సు కండక్టర్ గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కూలీలంతా మహబూబ్ నగర్ వాసులు.
News September 29, 2024
సీఎంను కించపరిచేలా పోస్టు.. వ్యక్తిపై కేసు నమోదు
సీఎం చంద్రబాబును కించపరిచే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని టీడీపీకి చెందిన నాయకుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శెట్టూరుకు చెందిన లక్ష్మణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.