News October 4, 2024

ATP: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!

image

హిందూపురం మం. రాచపల్లికి చెందిన వేమారెడ్డి మ్యారేజ్ బ్యూరో చేతిలో మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె సొంతూరు భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.

Similar News

News October 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసిన పుట్టపర్తి రూరల్ ఎస్సై

image

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను పుట్టపర్తి రూరల్ ఎస్సై లింగన్న మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పుట్టపర్తి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధులలో అంకితభావంతో పనిచేసే పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా చూడాలన్నారు.

News October 4, 2024

ATP: ఎద్దుల బండిపై నుంచి పడి బాలుడి మృతి

image

అనంత జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

News October 4, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.77

image

అనంతపురం రూరల్‌ కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.77తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 630 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి రూ.67, కనిష్ఠ ధర రూ.51 పలికినట్లు తెలిపారు. టమాటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.