News October 17, 2024
దారుణం.. రసాయనాలతో మిల్క్ తయారీ
TG: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పాల పొడి, ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్, వనస్పతి, ఇతర రసాయనాలతో నకిలీ పాలను తయారుచేస్తున్నారు. HYD శివారు పీర్జాదిగూడలో ఈ ఉదంతం బయటపడింది. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట కల్తీ పాలు, పెరుగు, ఐస్క్రీంలను స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా లోగోలు వేసి విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 17, 2024
34కే 6 వికెట్లు.. నలుగురు డకౌట్
NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
News October 17, 2024
హిందీ గడ్డపై సత్తా చాటిన ‘సలార్’
ప్రభాస్ నటించిన సలార్-1 మూవీ హిందీ వెర్షన్ మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తరాదిన టీవీ ప్రీమియర్స్లో 30 మిలియన్ల వ్యూస్ సాధించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వ్యూస్ పొందిన టాప్-3 చిత్రాల జాబితాలో చేరింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘స్టార్ గోల్డ్’ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే 2023 నుంచి అత్యధిక రేటింగ్ పొందిన డబ్బింగ్ మూవీగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.
News October 17, 2024
అన్నాడీఏంకేకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.