News May 24, 2024
దారుణం.. ఇజ్రాయెల్ మహిళా సైనికులపై చిత్రహింసలు

ఇజ్రాయెల్ మహిళా సైనికులను చిత్రహింసలు పెడుతున్న వీడియోను హమాస్ ఉగ్రవాదులు తాజాగా విడుదల చేశారు. అందులో వారి ముఖంపై తీవ్ర గాయాలు కనిపించాయి. కొందరు నడవలేని స్థితిలో ఉండగా వారి కాళ్లను కట్టేసి జీపులో ఎక్కిస్తున్న దృశ్యాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసిన మిలిటెంట్లు.. 250 మందిని బందీలుగా ఎత్తుకెళ్లారు. అందులో హమాస్ చెరలో ఐదుగురు మహిళా సైనికులున్నారు.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


