News August 1, 2024
నిమ్స్లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్
TG: ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ సొంతూరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్లో చేరారు. శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.
Similar News
News February 2, 2025
RAILWAY: అన్నీ ఒకే యాప్లో..
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించేందుకు రైల్వేశాఖ ‘SWA RAIL’ అనే సూపర్ యాప్ తెస్తోంది. తాజాగా కొంతమందికి EARLY ACCESS ఇచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ట్రైన్ టికెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్, కోచ్ పొజిషన్, రన్నింగ్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్ల కోసం వేర్వేరు యాప్స్ వాడే అవసరం లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి.
News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.
News February 2, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటన.. విచారణకు హాజరైన ఈవో, ఎస్పీ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తిరుపతి కలెక్టరేట్లో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. గత నెల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, 40 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.