News July 11, 2024
దారుణం: బాలికలను కరిచిన ఎలుకలు

TG: మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అక్కడ చదివే 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పాఠశాల నిర్వాహకులపై తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కామారెడ్డి(D) దేశాయ్పేట ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలడంతో ఆయనతో పాటు మరో 9 మందిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్కు బీజేపీ మద్దతు

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 7, 2025
బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
News December 7, 2025
చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.


