News December 26, 2025

ATS విధానం అమలులోకి తేవాలి: అమిత్ షా

image

ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్‌తో ముందుకు సాగాలన్నారు.

Similar News

News December 27, 2025

18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

image

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.

News December 27, 2025

51 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఎయిమ్స్<<>> రాయ్‌పుర్ 51 కాంట్రాక్ట్ జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS ఉత్తీర్ణులైన వారు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

News December 27, 2025

పూజలో ఈ పొరపాట్లు ఫలితాలనివ్వవు..

image

పూజలో కొన్ని నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది. పూజా స్థలాన్ని, విగ్రహాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాడిపోయిన పూలు, మురికి పాత్రలు వాడితే పూజ శక్తి తగ్గుతుంది. పూజను తొందరగా ముగించే పనిలా కాకుండా, ఏకాగ్రతతో ముహూర్త సమయాలను అనుసరించి చేయాలి. విగ్రహాలను నేల మీద పెట్టకుండా సరైన పీఠంపై ఉంచాలి. పూజ పూర్తయ్యాక పాత వస్తువులను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.