News September 3, 2024
కాంగ్రెస్ గూండాల దాడి బాధాకరం: పువ్వాడ

TG: ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల <<14010859>>దాడి<<>> బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడబోమన్నారు. వరద బాధితులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతిపక్షంగా పోరాడే బాధ్యత తమపై ఉందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వాహనంపై దాడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఇలాంటి దాడులను తాము ప్రోత్సహించమని చెప్పారు.
Similar News
News December 1, 2025
అల్లూరి: నిర్వాసితులకు రేషన్ కష్టాలు.. 290 కి.మీ ప్రయాణం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రేషన్ పంపిణీ విషయంలో స్థానికత సమస్య ఎదురవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రేషన్ బదిలీ కావడం లేదు. ఏలూరు జిల్లా నుంచి బియ్యం ఇవ్వడం లేదు. దీంతో నిర్వాసితులు పాత గ్రామానికి సుమారు 290 కిలోమీటర్లు ప్రయాణించి, వేల రూపాయల కిరాయి చెల్లించి రేషన్ తెచ్చుకుంటున్నారు. పునరావాస గ్రామాలను పోలవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


