News August 26, 2025

గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.

Similar News

News August 26, 2025

10,270 ఉద్యోగాలు.. ఎల్లుండితో ముగియనున్న గడువు

image

IBPS క్లర్క్ పోస్టులకు ఎల్లుండితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. వెబ్‌సైట్: <>ibps.in<<>>
>>SHARE IT

News August 26, 2025

ఉదయమే ఈ ప్రమాదం ఎక్కువ: వైద్యులు

image

ఉదయం వేళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. మేల్కొనే సమయంలో గుండెపై ఒత్తిడి పడి, రక్తపోటు పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిద్ర లేచిన 0-100 సెకన్ల వ్యవధిలో, ఉదయం 7-11 గంటలతో పాటు. సాయంత్రం 5-6 గంటల సమయంలోనూ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రమాదాన్ని తగ్గించేందుకు నిద్ర లేవగానే నీరు తాగడం, సమయానికి మెడిసిన్ తీసుకోవడం, ప్రోటీన్‌ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

News August 26, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ కొత్తగూడెం, BHPL, మహబూబాబాద్, ములుగు, WGLలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, HNK, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, MNCL, మేడ్చల్, NLG, నిర్మల్, PDPL, సిరిసిల్ల, రంగారెడ్డి, SDPT, సూర్యాపేట, యాదాద్రిలో పిడుగులతో వానలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.