News September 5, 2024

హిందువులపై దాడి అంశాన్ని అతి చేశారు: బంగ్లా చీఫ్ అడ్వైజర్

image

హిందువులపై దాడులు రాజకీయమైనవే తప్ప మతపరమైనవి కావని బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ అన్నారు. వాటిని అతిచేసి చూపించారని PTI ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మోదీకీ ఇదే చెప్పాను. ఈ దాడులకు అనేక కోణాలు ఉన్నాయి. దుర్మార్గపు అవామీ లీగ్, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోగానే ఆ కార్యకర్తలపై దాడులు జరిగాయి. హిందువులూ వారి పక్షం కాబట్టే దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికీ, అవామీ కార్యకర్తలకు తేడా లేదు’ అని అన్నారు.

Similar News

News February 4, 2025

శుభ ముహూర్తం(04-02-2025)

image

✒ తిథి: శుక్ల షష్ఠి ఉ.7.53 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.12.52 వరకు
✒ శుభ సమయం: సా.4.22 నుంచి 5.22 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.15 నుంచి 10.45 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 -రా.7.24 వరకు

News February 4, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ

News February 4, 2025

అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష

image

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.