News May 20, 2024
భారత విద్యార్థులపై దాడి.. ఆరా తీసిన సీఎం

TG: కిర్గిస్థాన్లో భారత విద్యార్థులపై దాడి ఘటనపై CM రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో అధికారులు బిష్కక్లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీతో మాట్లాడారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. స్థానిక ఘటనల్లో మన విద్యార్థులెవరూ గాయపడలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
Similar News
News December 4, 2025
కర్నూలు: ‘ఆ మండలం మాకొద్దు’

ఆదోని మండల విభజనపై ఆందోళనలు <<18458309>>ఉద్ధృతం<<>> అవుతున్నాయి. 17 గ్రామాలతో పెద్ద హరివణం మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. మదిరె, నాగనాథహళ్లి, గణేకల్ తదితర గ్రామాల ప్రజలు పెద్దహరివరణం తమకు 30 కి.మీ దూరం వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని రూరల్, అర్బన్, పెద్ద హరివణం, పెద్ద తుంబళం మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేస్తున్నారు.
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.


