News September 12, 2024

కౌశిక్‌పై దాడి.. మా పార్టీకి సంబంధం లేదు: TPCC చీఫ్

image

TG: అరికెపూడి గాంధీపై BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ‘ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ దాడితో మా పార్టీకి సంబంధం లేదు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు. అరికెపూడి టెక్నికల్‌గా BRS సభ్యుడే. నిబంధనల మేరకే PAC ఛైర్మన్ అయ్యారు. ఉపఎన్నికలు వచ్చినా KTRకు నిరాశ తప్పదు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News December 18, 2025

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి తిరిగి APకి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

News December 18, 2025

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

image

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

News December 18, 2025

ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

image

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.