News December 28, 2024

ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్

image

AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకటరెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పరామర్శించారు.

Similar News

News November 17, 2025

ఐబొమ్మకు ఇక సెలవు

image

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్‌సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

News November 17, 2025

ఐబొమ్మకు ఇక సెలవు

image

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్‌సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

News November 17, 2025

‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్‌ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.