News October 20, 2024
ఉత్తర గాజాపై దాడి.. 73 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో 73 మంది మరణించినట్లు హమాస్ సంస్థ పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలిపింది. అయితే మరణాల సంఖ్యపై క్లారిటీ లేదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి కలకలం రేపింది.
Similar News
News October 20, 2024
BREAKING: భారత్ పరాజయం
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45*), రవీంద్ర(39*) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు NZ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News October 20, 2024
ప్రియాంకపై పోటీ.. ఎవరీ నవ్యా హరిదాస్?
వయనాడ్ MP స్థానంలో ప్రియాంకా గాంధీ(INC)పై BJP నుంచి <<14401386>>నవ్యా హరిదాస్(39)<<>> పోటీ చేయనున్నారు. బీటెక్ పూర్తిచేసిన ఈమె రాజకీయాలపై ఆసక్తితో BJPలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్లో 2సార్లు కౌన్సిలర్గా గెలిచారు. 2021లో కోజికోడ్ సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు MPకి పోటీ చేసే అవకాశాన్ని అధిష్ఠానం కల్పించింది. ఈమె భర్త శోభిన్ శ్యామ్ మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.
News October 20, 2024
మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు
AP: బద్వేల్ ఘటనలో యువతి <<14403526>>చనిపోవడంపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.