News November 1, 2024

కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

image

AP: దీపావళి పండుగ రోజున కాకినాడ జిల్లాలో ఘర్షణ చెలరేగింది. కాజులూరు(మ) సలపాకలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా, ముగ్గురు చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

APPLY NOW: THDCలో ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(THDC) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మైన్ సర్వేయర్, మైన్ జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్ట్, సీబీటీ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in

News November 9, 2025

జన్మ బంధం నుంచి విముక్తి పొందాలంటే..?

image

యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||
||ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే||
జన్మ, సంసార బంధనాల నుంచి విముక్తి కలిగించే మహోన్నత శక్తులు గల విష్ణుమూర్తిని నమస్కరిస్తూ.. మోక్ష మార్గమైన ఆయన నామస్మరణ నిత్యం చేయాలని దీని అర్థం. మహా శక్తివంతమైన ఈ మంత్రాలను పఠిస్తే.. ఆయన మనలను కష్టాలు, జన్మ బంధాల నుంచి విముక్తలను చేస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 9, 2025

బస్సు ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు

image

TG: రాష్ట్రంలో పలు కుటుంబాల్లో విషాదం నింపిన మీర్జాగూడ <<18199288>>బస్సు<<>> ప్రమాదంలో ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం తీసుకోలేదని తేలింది. మృతదేహాలలో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే వెహికల్స్ కండిషన్స్‌కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో 19మంది మరణించిన సంగతి తెలిసిందే.