News August 15, 2024
అకారణంగా బంగ్లా హిందువులపై దాడులు: భాగవత్

బంగ్లాదేశ్లో అకారణంగా హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్లో పతాకావిష్కరణ తర్వాత మాట్లాడారు. ‘స్వతంత్రంలో ‘స్వ’ అంటే స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలదే. ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించాలనే దేశాలు చాలా ఉన్నాయి. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. మనం జాగ్రత్తగా ఉండాలి. అస్థిరత, అరాచకత్వం ఉన్న దేశాల ప్రజలకు సాయం చేయడం మనకు అలవాటే’ అని ఆయన అన్నారు.
Similar News
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<
News December 9, 2025
ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్పూర్కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
News December 9, 2025
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.


