News September 16, 2024
సూఫీ మందిరాలపై దాడులు.. బంగ్లాలో కలకలం

బంగ్లాదేశ్లో వర్గ వైషమ్యాలు తగ్గడం లేదు. కొన్నాళ్ల కిందట చెలరేగిన హింసలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. భారత స్నేహ చిహ్నాలను బద్దలుకొట్టారు. తాజాగా సూఫీ మందిరాలు, స్థలాలపై దుండుగులు దాడులు చేస్తుండటంతో ఆ వర్గంవారే సొంతంగా భద్రతను చూసుకుంటున్నారు. రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ఉర్సు నిర్వహిస్తుండగా నిన్న రాత్రి సిలెట్లో హజ్రత్ షా పరన్ కట్టడంపై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Similar News
News December 26, 2025
చైనాతో సై అంటున్న భారత్!

చైనా ఎప్పటికైనా జిత్తులమారే అని గ్రహించిన భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాలను వేగవంతం చేస్తోందని అమెరికాకు చెందిన Wall Street Journal పేర్కొంది. 2020 బార్డర్ ఫైట్లో చైనా కొన్ని గంటల్లోనే ఆర్మీని తరలించగా ఇండియాకు వారం పట్టిందని తెలిపింది. దీంతో రోడ్లు, టన్నెల్స్, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాల కోసం Border Roads Organization బడ్జెట్ను $280 మిలియన్ల నుంచి $810 మి.కు పెంచిందని వివరించింది.
News December 26, 2025
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు?

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అనసూయ దేవిల పుత్రుడైన దత్తుని 3 తలలు సృష్టి, స్థితి, లయకారక శక్తికి, ఆరు చేతులు సర్వదిక్కుల వ్యాప్తికి సంకేతాలు. ప్రకృతిలోని 24 అంశాలను గురువులుగా స్వీకరించిన ఈయన విశ్వగురువు. ఆయనను పూజించి అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయని నమ్మకం. దత్తాత్రేయుని ఆరాధిస్తే అటు గురువు, ఇటు దైవం ఇద్దరి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.
News December 26, 2025
త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.


